నవతెలంగాణ – హైదరాబాద్ : నిమ్స్ వైద్యుడికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు. పంజాగుట్ట నిమ్స్లో సీనియర్ రెసిడెంట్గా పని చేస్తున్న వైద్యుడికి సైబర్ నేరగాళ్లు దమ్కీ ఇచ్చారు. ఓఎల్ఎక్స్లో నిమ్స్ వైద్యులు అమ్మకానికి ఓ ఎలక్ట్రిక్ కుర్చీ పెట్టారు. జితేంద్ర శర్మ పేరుతో వైద్యుడికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. తనకు కూకట్పల్లిలో ఫర్నిచర్ దుకాణం ఉందని తనని తాను పరిచయం చేసుకున్నాడు. కుర్చీ కొనుగోలు చేస్తానని చెప్పి డబ్బు పంపేందుకు క్యూఆర్ కోడ్ పంపించాడు. దానిని స్కాన్ చేయాలని చెప్పడంతో నమ్మిన వైద్యుడు వెంటనే స్కాన్ చేశారు. అంతే.. ఆయన ఖాతా నుంచి రూ.2.58 లక్షలు కళ్లు మూసి తెరిచేసరికి మాయమయ్యాయి.