నవతెలంగాణ -నసురుల్లాబాద్
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, అన్నారు. ఆదివారం బాన్సువాడ నియోజకవర్గం లోని బాన్సువాడ, బీర్కూర్ తదితర మండలాల్లో ఎన్టీ రామారావు 100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని బీర్కూర్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి పాలాభిషేకంలో కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు రాజకీయంకు అడుగులు నేర్పిన మహా ఘనుడు ఆని, తనకు రాజకీయ అడుగులు నేర్పిన ఎన్టీ రామారావు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్టీ రామారావు అన్నారు. ఎన్టీ రామారావు నాటిన మొక్కనే నేడు మీ ముందుకు స్పీకర్ గా ఉన్నానని తెలిపారు. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన జీవితం సాగిందన్నారు. తెలుగు సినిమాలలో ఆయన వేసిన పాత్రల ప్రభావం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. రాజకీయ చైతన్యం, రాజకీయంలో నాయకులు ఎలా నడచుకోవాలని చూపించిన మహనీయుడు అని కొనియాడారు. నందమూరి తారక రామారావు సామాన్య ప్రజలకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పటేల్ పట్వారి వ్యవస్థను నిర్మూలించి, దొరతనాన్ని ఉక్కు పాదంతో అణిచివేసి ప్రతినిత్యం ప్రజల అవసరాలు తెలుసుకొని అభివృద్ధి దిశలో నడిపిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు డాక్రా మహిళా సంఘాలకు నాంది పలికి మహిళలంటే ఆదిపరాశక్తి మహిళలకు ప్రతి రంగంలో 50 శాతం రిజర్వేషన్ ఉండాలి ప్రతి రంగంలో ముందుండాలి అని మహిళలను ప్రోత్సహించిన మహా యోధుడు ఆడబిడ్డకు తన పుట్టిన ఇంట్లో తన అన్నదమ్ములతోపాటు తనకు కూడా సమానమైన ఆస్తిపస్తులు వచ్చే విధంగా జీవో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మాజీ సర్పంచ్ కమ్మ సత్యనారాయణ, ఎంపీపీ రఘు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్ప రావు, ఆనంద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.