![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG_20230818_170156.jpg)
నవతెలంగాణ – అశ్వారావుపేట
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిరక్షరాస్యులు ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానంను ప్రారంభించడం జరిగిందని ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరాం మూర్తి అన్నారు.2023 – 2024 సంవత్సరములు గాను అడ్మిషన్ లని ప్రారంభించటం జరిగిన నేపధ్యంలో ప్రజలలో అవగాహన కోసం ఓపెన్ స్కూల్ కరపత్రాలను శుక్రవారం అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ అర్హుల అని,చదువు మధ్యలో ఆపిన వారికి, పదవ తరగతి ఫెయిల్ అయి 14 సంవత్సరాలు నిండిన వారికి పదవ తరగతి చదువుకునే సువర్ణావకాశం అన్నారు. 15 సంవత్సరాలు నిండి 10 వ, తరగతి పూర్తి చేసిన వారందరూ ఇంటర్మీడియట్ కోర్సు చదువు కొనే అవకాశం ఉందన్నారు.ఇంటర్మీడియట్ మానేసిన వారికి మరియు ఫెయిల్ అయిన వారికి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం కలదన్నారు. మహిళలకు పలు వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగులకు ప్రజలకు ప్రజా ప్రతినిధులకు వివిధ సంఘ సభ్యులకు,సామాజికంగా, ఆర్థికంగా వేరుపడిన వర్గాల వారికి ఒక సదవకాశం అనీ,అలాగే సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహించ బడతాయి అని తెలిపారు.అలాగే దీనిలో కొన్ని వెసులు బాటు ఉంటుందని,అవ వృత్తి విద్యా ఒక సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే అవకాశం,ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సులు ఫెయిల్ అయినప్పటికీ మీరు రాసిన రెండు సబ్జెక్టుల మార్కులు బదలాయించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఉచిత సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్,ఇష్టమైన ఏవైనా ఐదు సబ్జెక్టుల తో కోర్సు పూర్తి చేయవచ్చు అన్నారు.మహిళలకు ఎస్సీ, బీసీ,ఎస్టీ, మైనారిటీలకు, దివ్యాంగులుకు, మాజీ సైనికుల పిల్లలకు ఫీజు రాయితీ అవకాశం ఉంటుందని అయన తెలిపారు.కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు,అశ్వారావుపేట ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ టి.వెంకట్ పాల్గొన్నారు.