నవతెలంగాణ – పంజాబ్: పంజాబ్లోని తార్న్ తరన్ జిల్లాలో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. జిల్లాలోని లఖానా గ్రామంలో ప్రవేశించిన ఆ పాకిస్థానీ డ్రోన్ ను భద్రతా బీఎస్ఎఫ్ బలగాలు పేల్చివేశాయి. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ స్వయంగా ప్రకటించింది. గురువారం రాత్రి పాకిస్థాన్ వైపు నుంచి భారత సరిహద్దుల్లోకి డ్రోన్ రావడం గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు. రాత్రి 9.12 గంటలకు దాన్ని కూల్చేశారు. అనంతరం బీఎస్ఎఫ్ జవాన్లు, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టి ఈ రోజు ఉదయం 8.10 గంటలకు డ్రోన్ శకలాలను గుర్తించారు.