![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG_20230717_133853-228x300.jpg)
పంచాయతీ కార్మికుల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 12 వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో జీపీ కార్మికులు స్థానిక మూడు రోడ్ల కూడలి నుండి సంత మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు మట్లకుంట కామేశ్వరరావు మాట్లాడుతూ పాలకులు తమకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు అని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల స్పందించి చర్చలకు పిలవాలని ఆయన కోరారు. జరుగుతున్న సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ట్రెజరర్ వేల్పుల ముత్తారావు, కమిటీ సభ్యులు మురళి, భవాని ప్రసాద్, ఆరేపల్లి నాగేంద్రరావు, కట్ట శీను, రంజిత్ సింగ్,మహేష్,రమణ, జ్యోతి,బాణాల వరలక్ష్మి, అల్లాడి ధనమ్మ,అలివేలు,బద్దే లక్ష్మి,పద్మ,రాణి,శ్యామ్, రమాదేవి,స్వప్న,రాధాకృష్ణ, ఇంద్ర,రాణి,నాగమణి, మరియమ్మ,రాము తదితరులు పాల్గొన్నారు.