– దీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రేషన్ డీలర్ల జూన్ 4 డెడ్ లైన్
– సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దిగి రాకపోతే జూన్ 5వ తేదీ నుండి నిరవధిక సమ్మె
– రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్లు
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర చౌక ధరల దుకాణాల జేఏసీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వానికి రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ 4 డెడ్ లైన్ విధించారు జూన్ 4వ తేదీ వరకు తమ సమస్యల పరిష్కారానికి దిగిరాకపోతే జూన్ 5వ తేదీ నుండి రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో డీలర్ల మంతా నిరవధిక సమ్మె చేపడతామని మద్నూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రమేష్ దేశాయి ఆధ్వర్యంలో మండల డీలర్లు సోమవారం నాడు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మండల తహసిల్దార్ అనిల్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రమేష్ దేశాయ్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించని కారణంగా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ప్రభుత్వానికి జూన్ 4వ తేదీ డెడ్లైన్ విధించడం జరిగిందని అప్పటివరకు ప్రభుత్వం దిగి రాకపోతే జూన్ 5వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపడతామని తెలిపారు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 2021 సంవత్సరంలో స్ట్రైక్ నోటీసు ఇచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో మా సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ వేయడం జరిగిందని మంత్రుల సబ్ కమిటీ ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం చేయలేదని ఆయన మండిపడ్డారు రేషన్ డీలర్లకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించిన వాటిని ఆయన ఒక్కొక్కటిగా తెలియజేశారు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లకు వేతనాలు ఇవ్వాలి, పదిలక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలి, దిగుమచ్చి అమాలి ప్రభుత్వమే భరించాలి, ప్రతి ఎం ఎల్ ఎస్ పాయింటులో వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి, శాశ్వత అతలారైజేషన్ ఇవ్వాలి, ఉచిత బియ్యం పంపిణీ సందర్భంగా కరోనా సోకి చనిపోయిన 99 మంది డీలర్లకు ఎటువంటి నియమ నిబంధన లేకుండా కారుణ్య నియామకం కింద డీలర్ షిప్ ఇవ్వాలి, కారుణ్య నియామకాలు 50 సంవత్సరాలు పెంచాలి, ఇతర నిత్యవసర సరుకులు పంపిణీ చెయ్యాలి, చనిపోయిన డీలర్కు దహన సంస్కారాలకు 50 వేల రూపాయలు ఇవ్వాలి, ఒక క్వింటాలుకు ఒక శాతం తరుగు ఇవ్వాలి ప్రతి నెల ఈపాస్ మిషన్లో నుంచి తొలగించాలి క్లోజింగ్ బ్యాలెన్స్, కార్పొరేషన్ వద్ద వివిధ రకాల తో ఉన్న మా డబ్బులు ఒక నిధి ఏర్పాటు చేసి దానికి కమిషనర్ అధ్యక్షతన రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్లకు రుణ రూపంలో అవసరాన్నిబట్టి అందించాలి, ఈ విధమైన న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 4వ తేదీ లోపు పరిష్కరించకుంటే రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు రేషన్ దుకాణాలు బందు పెట్టి వివిధ రూపంలో ఆందోళనలు ఉద్యమాలు ఉధృతం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని మండల రేషన్ డీలర్ అధ్యక్షులు తెలిపారు తాసిల్దారుకు అందజేసిన వినతి పత్రం అందజేత కార్యక్రమంలో కాంబ్లే పవన్ కోశాధికారి మీనాక్షి వీరితో పాటు మండలంలోని వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు