– 44,097 మంది దరఖాస్తు
-16,040 ఓట్లను తిరస్కరించిన ఈసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఎన్నికల్లో ఈసారి 28,057 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకుకోన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గణాంకాలను గురువారం విడుదల చేసింది. మొత్తం 44,097 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు
దరఖాస్తు చేసుకోగా 16,040 ఓట్లను ఎన్నికల సంఘం వివిధ కారణాలతో తిరస్కరించింది. అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ధరఖాస్తులు, ఓట్లు సిద్దిపేట జిల్లా నుంచి నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 812 మంది దరఖాస్తు చేసుకోగా 757 ఓట్లు ఆమోదం పొందాయి. అలాగే అత్యల్పంగా దరఖాస్తులు, ఓట్లు బహదూర్ పుర నుంచి నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 11 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, మొత్తం 11 ఓట్లను ఎన్నికల కమిషన్ ఆనుమతించింది. అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులు, 80 ఏళ్ల పైబడిన వద్ధులు, అంగవైకల్యం, కోవిడ్తో బాధపడుతున్న వారు, ఎన్నికల్లో విధులు నిర్వహించే జర్నలిస్టులు మొదలగు వారు పోస్టల్ బ్యాలెట్కు అర్హులు. అయితే చాలా మంది ఫాం..డీ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు, విచారణ సమయంలో అందుబాటులో లేక పోవడం, సరైన దృవీకరణ పత్రాలు సమర్పించని కారణంగా మూడింట ఒక వంతు దరఖాస్తులు రిజెక్ట్ అయినట్టు తెలుస్తోంది.