– జిల్లా సాధారణ పరిశీలకుడు పథ్విరాజ్
నవతెలంగాణ – మెదక్
జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికలకు రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సహకరించాలని జిల్లా సాధారణ పరిశీలకుడు పథ్విరాజ్ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలు- 2023, ఎన్నికల నియమావళిలో బాగంగా గురువారం సమీకత కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నిక సంఘం నియమించిన జిల్లా సాధారణ పరిశీలకులు పధ్వీరాజ్ బీపీ, వ్యయ పరిశీలకులు సంజరు కుమార్, జిల్లా పోలీస్ పరిశీలకులు డిఐజి సంతోష్ కుమార్ తుకారాంలతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలన్నారు. ఈ ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీం లను ఏర్పాటు చేసిందని, తద్వారా ఎంసిఎంసి సెంటర్లో టీవీలు ఏర్పాటుచేసి మోనిటరింగ్ చేస్తుందని తెలిపారు. జిల్లా వ్యయ పరిశీలకుడు సంజరు కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని, రూ.10000 కంటే ఎక్కువ బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవద్దన్నారు. ఎన్నికల ప్రచార సామాగ్రి రవాణా కోసం అనుమతి పొందాలని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల విలువలు ఈసిఐ ధరల విలువల ప్రకారం వర్తిస్తాయని, ఏదైనా అనుమానాలు ఉంటే నివత్తి చేసుకోవాలని, అభ్యర్థి ఖర్చు నమోదు చేయాలన్నారు. జిల్లా పోలీస్ పరిశీలకుడు సంతోష్ కుమార్ తుకారాం మాట్లాడుతూ.. పోలీస్ శాఖ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేల, రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థుకు సహకరించాలన్నారు. ఎన్నికల్లో పోలీస్ పాత్ర చాలా గొప్పదని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవకాశం కల్పించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సహకరించాలని, రాజకీయ పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే నివత్తి చేసుకోవాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు రాజర్షి షా మాట్లాడుతూ.. దాతలు చేసే సహాయ సహకారాలు, ఎన్నికల ప్రచార ఖర్చులు అభ్యర్ధి ఖాతాలో జమ అవుతాయన్నారు. ఈ నెల 18న రెండవ రాండమైజేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మెదక్, బీవిఆర్ఐటి ఇంజనీరింగ్ కలశాల నర్సాపూర్ లో ఉంటుందన్నారు. ప్రతి ఓటర్ ఈసీఐ గుర్తించిన 13 గుర్తింపు పొందిన కార్డ్ లలో ఏదో ఒక కార్డ్ తీసుకొని పోలింగ్ కేంద్రానికి రావాలన్నారు. డమ్మీ బ్యాలెట్ తయారుచేసుకునే వారు వారి గుర్తులు మాత్రమే డమ్మీ బ్యాలెట్ లో ఉండాలన్నారు. డమ్మీ బ్యాలెట్ ను తెలుపు, పింక్, ఇతర పార్టీల గుర్తి%శీ%పులతో తయారు చేయరాదని తెలిపారు. పోలింగ్ ఏజెంట్ నియామకంలో జాగ్రత్తలను పాటించలన్నారు. ఏదైనా పిర్యాదులు ఉంటే సి -విజిల్,1950 లో పిర్యాదు చేయవచ్చని, పిర్యాదులు 100 నిముషాల్లో పరిష్కారం లభిస్తుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క పూర్తి సమాచారం కోసం కేవైసీ ఆప్ లో తెలుసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఎవరైనా ప్రచారాన్ని అడ్డుకుంటే పరస్పర ఘర్షణ, పరస్పర పిర్యాదులు ఉంటే 100 ఫోన్ చేయాలన్నారు. టీమ్ లలో పోలిసు అధికారులు ఉంటారని, ప్రచారానికి సంబంధిచిన పిర్యాదులు పరిష్కారిస్తారన్నారు. రాజకీయ పార్టీలా నాయకులకు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే సందేహాలు నివత్తి కోసం పరిశీలకులను సంప్రదించాలని సూచించారు. పధ్వీ రాజ్ బీపీ ఐఏఎస్, సాధారణ పరిశీలకులు 8969698906, సంజరు కుమార్ వ్యయ, పరిశీలకులు 9177080321, సంతోష్ కుమార్ తుకారాం డీఐజీ పోలీసు పరిశీలకుడు 8125390500 లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, ఎన్నికల నోడల్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.