– కలెక్టరేట్లో సెల్ఫీ పాయింట్
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు రాజర్షిషా
నవతెలంగాణ – మెదక్
యువ ఓటర్లు నూతన ఉత్సాహంతో ఓటింగ్లో పాల్గొనాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు పథ్విరాజ్, వ్య య పరిశీలకుడు సంజయ్ కుమార్, పోలీస్ పరిశీలకుడు సంతోష్ కుమార్ తుకారాం, జిల్లా ఎన్నికల అధికారి, క లెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం 100 శాతం పోలింగ్ లక్ష్యంగా యువ ఓటర్లను ఆకర్షించడానికి సెల్ఫీ పాయింట్లను ఆవిష్కరించారు. అనంతరం యువ ఓ టర్లు, మహిళలు, ఉద్యోగులచే ఓటరు ప్రతిజ్ఞా చేయించారు. ఎన్నికలకు సంబంధించిన ఓటర్ నమోదు, ఎథిక్ ఓటింగ్, సి -విజిల్, టోల్ ఫ్రీ నెం1950 వంటి వాటి పై రంగోలి పోటీలు నిర్వహణ ఏర్పాటు చేశా రు. పోటీలో వివిధ శాఖలకు చెం దిన 50 టీమ్ లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ ఎన్నికలలో భాగంగా స్వీప్ ఆధ్వర్యంలో జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో 100 శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రచారం చేస్తుందని తెలిపారు. నేను కచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో ప్రజలు ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు. అనంతరం నిర్వహించిన రంగోలిలో మూడింటికి ఉత్తమమైనదిగా ఎంపిక చేశారు. మెదక్ నగర పంచాయతీ మొదటి బహుమతి, రెండువ, మూడవ బహుమతులు డిసిపియు, మెదక్ చైల్డ్ లైన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎన్నిక అధికారి, అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మ శ్రీ, జిల్లా సంక్షేమ అధికారి బ్రాహ్మజి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి విజయలక్ష్మి, డీసీఏ కరుణ, ఏవో యునస్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.