నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పోస్టల్ శాఖలో పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెప్టెంబర్ 14న పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొంది. సమస్యలు ఉన్న పెన్షనర్లు ఆగస్టు 16వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు పంపాలని కోరారు. ఇతర వివరాలకు హైదరాబాద్ ఆబిడ్స్లోని ప్రధాన తపాలా కార్యాలయం అసిస్టెంట్ అక్కౌంట్స్ ఆఫీసర్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.