నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ చైతన్య గీతిక, ప్రజల గొంతుక శాశ్వతంగా మూగబోయింది. ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణంపై నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఒక అన్నమయ్య పుట్టారు, దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు, దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు, దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు, దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’ అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ చైతన్య గీతిక, ప్రజల గొంతుక శాశ్వతంగా మూగబోయింది. ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) తుదిశ్వాస విడిచారు.