నవతెలవగాణ- ముంబాయి: పరువు నష్టం దావా కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాంబే కోర్టు మెట్లక్కారు. సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసుకు సంబంధించి తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కోరారు. గౌరీ లంకేశ్ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్గాంధీపై 2017లో పరువు నష్టం కేసు నమోదైంది.