– ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్
నవతెలంగాణ- బెజ్జంకి
మానకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయి వల్ల అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులే అన్ని విధాలుగా అభివృద్ధి పొందారని.. ప్రజలు మాత్రం సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారని మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిజెపి పార్టీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఆరోపించారు.సోమవారం మండల పరిధిలోని దాచారం,ముత్తన్నపేట,నర్సింహుల పల్లి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారమే లక్ష్యంగా ప్రజలను మభ్యపెడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మండలాధ్యక్షుడు కొలిపాక రాజు,నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,కరివేద మైపాల్ రెడ్డి,చాడ వెంకట రెడ్డి, బామండ్ల జ్యోతి,ముస్కె మహేందర్,బుర్ర మల్లేశం,గైని రాజు,సంగ రవి,దీటి రాజు,అజయ్ తదితరులు పాల్గొన్నారు.