నవతెలంగాణ – తిరుమలగిరి
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు సరైన గుర్తింపుతో పాటు బాధ్యతలు అప్పజెప్పితే తాను రంగ0 నుండి తప్పుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి గెలుపు కోసం కృషి చేస్తానని తెలంగాణ ఉద్యమకారుడు జిల్లా కాంగ్రెస్ నాయకులు భాషప0గు భాస్కర్ అన్నారు.సోమవారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని పద్మశాలి కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడాతు తెలంగాణ ఉద్యమంతో పాటు సూర్యాపేట ,తుంగతుర్తి నియోజకవర్గం లో జరిగిన ఎన్నో సామాజిక ఉద్యమాలతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలలో తాను కీలక పాత్ర పోషించి, ప్రజలను చైతన్యవంతం చేశానని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం జరీగిన సుదీర్ఘ పోరాటంలో తాను తుంగతుర్తి, సూర్యాపేట వేదికగా జేఏసీలను ఏర్పాటు చేసి, ఉద్యమంలో పాల్గొని ప్రజలను, మేధావులను చైతన్యవంతం చేశానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో తాను కూడా కీలకపాత్ర పోషించానని ఆయన చెప్పారు. అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో, పోరాటాలలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని అన్నారు. అలాగే తుంగతుర్తి లో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో పాల్గొని పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించానని , తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ కోసం దరఖాస్తు చేసుకొని తనకు కేటాయించాలని కోరానని చెప్పారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో భాగంగా తుంగతుర్తి నుండి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా తాను నామినేషన్ వేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం తన పాత్రను గుర్తించి తనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పితే తాను రంగం నుండి తప్పుకొని పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు.తనతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా తన ముఖ్య అనుచరులు,తన కార్యకర్తలు, నాయకులు అందరూ ఏకమై బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో భూమాపియా, ఇసుక మాఫియా, దొంగ నోట్ల చలామణి ,హత్య రాజకీయాలకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యేను ఈ ప్రాంతం నుండి తరిమి వేయడంలో తాను ముందుండి కీలకపాత్ర పోషిస్తానని, ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెప్పడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. స్థానికేతరుడైన ఎమ్మెల్యేను ఈ ప్రాంతం నుండి తరిమి వేయడానికి ప్రజలను చైతన్యవంతం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తుంగతుర్తి, నూతనకల్, మోత్కూరు, తుంగతుర్తి తిరుమలగిరి తో పాటు అన్ని మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పత్తేపురం విజయ్, ఎండి రెహమాన్, లింగంపల్లి విజయ్ కుమార్, పోరేళ్ళవిప్లవ కుమార్,డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.