చైనాలోని హాంగ్జౌ నగరంలో ఈ ఏడాది ఆసియా క్రీడలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. ఎప్పటిలాగానే మహిళా క్రీడాకారులు ఇక్కడ కూడా తమ సత్తా చాటుకున్నారు. దేశానికి పతకాల వర్షం కురిపించారు. ఆసియా దేశాలు అబ్బుర పడేలా చేశారు. మన మహిళా క్రికేట్ జట్టు చరిత్ర సృష్టించింది. దేశానికి తొలి స్వర్ణం అందించారు. కొందరు ప్రపంచ రికార్డు కొట్టారు. మన హైదరాబాదీ ఈషా సింగ్ షూటింగ్లో మెరిసింది. రెండు పతకాలు అందుకుంది. ఈ క్రీడల్లో మహిళలు సాధించిన విజయాల గురించి నేటి మానవిలో…
క్రికెట్ జట్టుకు తొలి స్వర్ణం
ఆసియా క్రీడలు 2023 మహిళల క్రికెట్ జట్టు తమ ఆటను అద్భుతంగా ప్రదర్శించారు. ఫైనల్స్లో శ్రీలంక జట్టుతో తలపడ్డారు. బోర్డ్లో 116 పరుగుల మోస్తరు టోటల్ను నమోదు చేసినప్పటికీ, మన జట్టు మహిళలు స్వర్ణాన్ని కైవసం చేసుకోవడానికి ఆట రెండవ భాగంలో సమిష్టి కృషి చేశారు. తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. 9 పరుగుల వద్ద షఫాలీ వర్మ ఔట్ కావడంతో భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ రెండో వికెట్ భాగస్వామ్యంలో మెరిసి బోర్డుకు పరుగులు జోడించారు. వీరిద్దరూ మినహా మరే ఇతర బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. టెయిలెండర్ల వికెట్లను రాజేశ్వరి గయక్వాడ్ చేజార్చుకోవడంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు కొనసాగింది. దీంతో శ్రీలంక ఎనిమిది వికెట్లు కోల్పోయి 97 పరుగుల వద్ద నిలిచింది. ఇది మొత్తం జట్టు ప్రయత్నం. వీరి కృషి ఈ ఏడాది క్రికెట్లో టీమ్ ఇండియాకు బంగారు పతకాన్ని అందించింది.
72 ఏండ్ల తర్వాత షాట్పుట్లో కాంస్యం
మహిళల షాట్పుట్ ఈవెంట్లో కిరణ్ బలియన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. భారతదేశం అనేక క్రీడలలో పతకాలు సాధించింది. అయితే ఈ కాంస్యానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది కిరణ్కు చారిత్రాత్మక ఘట్టాన్ని అందించడమే కాకుండా ఏడాది ఆసియా క్రీడల్లో భారతదేశానికి మొదటి అథ్లెటిక్స్ పతకాన్ని అందించింది. షాట్పుట్లో 72 ఏండ్ల సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లోపాన్ని భర్తీ చేసింది. 1951లో న్యూ ఢిల్లీలో జరిగిన ప్రారంభ ఎడిషన్లో బార్బరా వెబ్స్టర్ భారతదేశానికి చివరిసారిగా ఆసియా గేమ్స్లో మహిళల షాట్పుట్లో పతకాన్ని కైవసం చేసుకుంది. 24 ఏండ్ల కిరణ్ ఇండియన్ గ్రాండ్ ప్రి 5లో 17.92 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోను నమోదు చేసింది. ఈ ఆసియా క్రీడల్లో ఆమె అద్భుతమైన ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ఆమె మొదట్లో జావెలిన్ త్రో క్రీడాకారిణి అయినప్పటికీ కుటుంబం, కోచ్ సలహాతో షాట్పుట్కు మారింది. ఆమె తండ్రి సతీష్ బలియన్ ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్. తన బిజీ షెడ్యూల్లో కూడా కూతురి శిక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఈ ఆసియా క్రీడల్లో కిరణ్ సాధించిన కాంస్య పతకం కేవలం క్రీడా విజయం మాత్రమే కాదు ఆమె అంకితభావానికి చిహ్నం.
వుషులో నౌరెమ్ రోషిబినా దేవి
ఆసియా క్రీడలు 2023లో మన దేశానికి చెందిన ముగ్గురు క్రీడాకారులు వీసాలు పొందలేక అనేక సవాళ్ళు ఎదుర్కొ న్నారు. ఈ వీసా వివాదాల మధ్యనే నౌరెమ్ రోషిబినా దేవి తన ఆటను కొనసాగించింది. మణిపూర్కి చెందిన ఆమె వీసా కోసం చాలా ఇబ్బంది పడింది. మహిళల 60 కేజీల విభాగంలో ఫైనల్స్కు చేరుకుంది. రోషిబినా ఆ విభాగంలో ప్రస్తుత ఛాంపియన్ చైనాకు చెందిన వు జియావోరుతో పోరాడాల్సి వచ్చింది. ఆమె శఱaశీషవఱని అధిగమించలేక పోయినప్పటికీ రోషిబినా ప్రయత్నాలు అభినందనీయం. ప్రారంభ రౌండ్లలో అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గేమ్లో సజీవంగా ఉండేందుకు తన శాయశక్తులా కృషి చేసింది. ఆమె గతంలో జకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడలలో కాంస్య పతకాన్ని, ఈ ఏడాది ఆసియా క్రీడలలో రజతం సాధించింది. దాంతో ఉషు రంగంలో ప్రముఖ వ్యక్తిగా నిలిచింది. రోషిబినా తన పతకాన్ని అవకాశాన్ని కోల్పోయిన ముగ్గురు వుషు అథ్లెట్లకు అంకితం చేసింది. మణిపూర్లో నెలకొన్న భయానక పరిస్థితుల రీత్యా తిరిగి ఇంటికి ఎప్పుడు వెళుతుందో తెలియక కన్నీళ్ళు పెట్టుకుంది.
తొలి మహిళా గోల్ఫర్
ఆసియా క్రీడలకు కేవలం ఒక వారం మాత్రమే సమయం ఉంది. వేదిక కార్యకలాపాలతో సందడిగా ఉంది. పచ్చని గోల్ఫ్ మైదానం నిశ్శబ్దంగా కనిపి స్తుంది. అయితే అదితి మాత్రం చారిత్రాత్మక పతకం తో ఉద్భవించింది. ఈ ఏడాది ఆసియా క్రీడలో చరిత్ర సృష్టించేందుకు అదితికి ఇది వేదికయింది. సెవెన్ స్ట్రోక్ ఆధిక్యంతో ఫైనల్ మ్యాచ్లోకి అడుగుపెట్టిన ఆమె దేశ ఆశలను తన భుజాలకెత్తుకుంది. అయితే చివరి రోజు మాత్రం ఈమెకు కొంత సవాలుగా మారింది. ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ అదితిలో అలుపెరగని స్పూర్తి కనిపించింది. అదే ఆమెకు రజత పతకాన్ని అందించింది. 13 ఏండ్ల వయసులో అదితి గోల్ఫింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2012 నుండి 2014 వరకు వరుసగా జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. అయితే ఆమె జూనియర్ సర్క్యూట్కే పరిమితం కాలేదు. సీనియర్ టైటిళ్లను కూడా కైవసం చేసుకుంది. 2014లో జూనియర్, సీనియర్ టైటిల్స్ రెండింటినీ ఏకకాలంలో సాధించిన గొప్ప గోల్ఫర్ ఆమె. ఆమె అసాధారణ నైపుణ్యాలకు ఇది నిదర్శనం.
షూటింగ్లో పాలక్ గులియా, ఈషా సింగ్
హోరాహోరీగా జరిగిన ఉత్కంఠభరితమైన పోటీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారతదేశ షూటర్లు పాలక్ గులియా, ఈషా సింగ్ దేశం కోసం అద్భుత ప్రదర్శన కొనసాగించారు. జకార్తా ఏషియాడ్ తర్వాత తన షూటింగ్ కెరీర్ను ప్రారంభించిన పాలక్ ఓ సంచలనంగా ఉద్భవించింది. ఆట ప్రారంభం నుండి చివరి వరకు ముందుకు సాగిన ఆమె ఫైనల్లో 242.1 పాయింట్ల అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా క్రీడల రికార్డును అందించింది. ఆసియా క్రీడల్లో ఈషాకు నాల్గవ పతకాన్ని అందుకుంది. వ్యక్తిగత విజయాలకు ముందు పాలక్,ఈషా దివ్యతో కలిసి పోటీకి దిగి రజతం సాధించారు. వీరిద్దరు సాధించిన పతకాలతో ఆసియా క్రీడల్లో మన పతకాల సంఖ్య ఎనిమిది స్వర్ణాలు, 11 రజతాలు, 11 కాంస్య పతకాలతో మొత్తం 30కి చేరుకుంది.
సుతీర్థ ముఖర్జీ, అహికా ముఖర్జీల డైనమిక్ ద్వయం
భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో తమ పేర్లను చెక్కుకున్నారు. ఈ చిన్ననాటి స్నేహితులు ఒక కాంస్య పతకాన్ని సాధించడానికి అద్భుతమైన సంకల్పాన్ని ప్రదర్శించారు. ఆసియా క్రీడల్లో మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్కు ఇది తొలి పతకం. వారి కుటుంబ పరిస్థితుల్లో ప్రస్తుత ఛాంపియన్లను గెలవడం అంత తేలికైన విషయం కాదు. ముఖర్జీల సెమీ ఫైనల్ పోరు ఉత్తర కొరియాకు చెందిన సుయోంగ్ చా, సుగ్యోంగ్ పాక్ల బలీయమైన జంటతో తలపడింది. ప్రారంభ ఆటలో 4-0 ఆధిక్యంలో ఉన్నారు. మొదటి గేమ్ను 11-7తో ముగించారు. రెండవ గేమ్ను 11-8తో ముగించి ఉత్తర కొరియర్లతో తమ పోటీని సమం చేశారు. మూడో గేమ్లో సుతీర్థ, అహిక మరోసారి తమ సత్తాను ప్రదర్శించారు.
షూటింగ్లో స్వర్ణం
నైపుణ్యం, టీమ్ వర్క్తో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్లో మన దేశం నుండి తలబడుతున్న మను భాకర్, ఎస్ ఈషా సింగ్, రిథమ్ సాంగ్వాన్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయం షూటింగ్ క్రీడలలో మన దేశ పరాక్రమాన్ని ఉదహరిం చడమే కాకుండా ఈ యువ షూటర్ల అద్భుతమైన ప్రతిభకు చిహ్నం. అంతర్జాతీయ వేదికపై అసాధారణ ప్రదర్శనను, దేశానికి కీర్తిని తీసుకురావడానికి యువ భారత జట్టు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆషి చౌక్సే, మణిని కౌశిక్, సిఫ్ట్ కౌర్ సమ్రా రజత పతకాన్ని సాధించారు. మొత్తం నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలతో మొత్తం 16 పతకాలను కైవసం చేసుకున్నారు.
సమ్రా గోల్డ్ మెరిసింది
ప్రతిభ, సంకల్పం కలగలిసిన అద్భుతమైన ప్రదర్శ నలో పంజాబ్కు చెందిన భారత యువ షూటర్, సిఫ్ట్ కౌర్ సమ్రా మహిళల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ వ్యక్తిగత ఈవెంట్లో బంగారు పతకంతో తన పేరును సుస్థిరం చేసుకుంది. 417.2 స్కోరుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో సామ్రా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. టీంలో ఇంకా ఇద్దరు ఉన్నప్పటికీ సామ్రా వ్యక్తిగత ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది, ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. క్వాలిఫికేషన్ రౌండ్లో 594 స్కోరుతో ఆమె వ్యక్తిగత ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. జాతీయ రికార్డును నెలకొల్పింది. ఇదే ఈవెంట్లో భారత్కు చెందిన ఆషి చౌక్సీ కాంస్యం సాధించి దేశానికి రెట్టింపు ఆనందాన్ని అందించింది. చౌక్సే అద్భుతమైన ప్రదర్శన చివరి షాట్తో మాత్రమే దెబ్బతింది. అయినప్పటికీ ఆమె కాంస్య పతకం సాధించింది.
జావెలిన్ క్వీన్ అన్నూ రాణి
మహిళల జావెలిన్ త్రోలో స్వర్ణం గెలవడమంటే అంత సులభం కాదు. అన్నూ రాణి ఒక అథ్లెట్గా గుర్తుంచబడటానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. 31 ఏండ్ల ఈ క్రీడాకారిణి ఈ ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించేందుకు ఎంతో కృషి చేసింది. తన నాల్గవ ప్రయత్నంలో 62.92 మీటర్ల అద్భుతమైన త్రోతో మహిళల జావెలిన్ త్రోలో దేశానికి మొదటి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. హాంగ్జౌలో మన దేశానికి వచ్చిన 15వ బంగారు పతకం ఇది. మహిళల జావెలిన్ త్రో ఫైనల్స్లో 56.99 మీటర్ల త్రోతో తన సత్తాను ప్రారంభించి, అద్భుతమైన ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ప్రతి త్రోతో దూరాన్ని మెరుగుపరుచుకుంటూనే ఉంది. రెండవ ప్రయత్నంలో ఆమె 60 మీటర్ల మార్కును దాటగలిగింది. పతకం కోసం ఆమెను పోటీలో నిలబెట్టింది. చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది.
సేకరణ : సలీమ