నవతెలంగాణ- రంగారెడ్డి: జిల్లాలోని కొహెడ్ సమీపంలో ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒక ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు