నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలో సంచలనం రేపిన అప్సర హత్య కేసుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. ‘‘ఈ కేసులో నిందితుడు వెంకట సాయికృష్ణ, మరో మహిళతో కలిసి వచ్చి అప్సర కనిపించడం లేదని శంషాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమెను ఈ నెల 3న భద్రాచలం వెళ్లేందుకు వాహనం ఎక్కించామని ఆ తర్వాత ఆమె నుంచి స్పందన లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాయికృష్ణతో పాటు వచ్చిన మహిళ అప్సర తల్లి అని ప్రాథమికంగా గుర్తించిన్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు సమయంలో వారిద్దరి వ్యాఖ్యలకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. సాయికృష్ణ, అప్సర కారులో నర్కుడ వైపు వెళ్లినట్టు తెలిసింది. ముందు సీట్లో అప్సర నిద్రిస్తున్న సమయంలో కారుకు కప్పే కవర్తో ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేసేందుకు సాయికృష్ణ యత్నించాడు. ఆమె ఎదురు తిరగడంతో రాయితో దాడి చేశాడు. దాడిలో ఆమె తీవ్ర రక్తస్రామై మృతి చెందింది. మరణించిన అప్సర శవాన్ని కారుకు కప్పే కవర్లో చుట్టేసి డిక్కీలో వేసుకుని మృతదేహాన్ని సరూర్నగర్కు తీసుకొచ్చి… స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మ్యాన్హోల్లో పడేశాడు. సరూర్నగర్ వద్ద సెప్టిక్ ట్యాంక్ సమీపంలో సాయి కృష్ణ మట్టి పోయించి అనుమానం రాకుండా వ్యవహరించాలని ప్రయత్నంచేసిన్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
అప్సర సీరియల్లో నటించాలని చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు డీసీసీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. తన సోదరి వద్ద ఉంటూ ప్రయత్నాలు చేస్తుండేది, ఈ క్రమంలో అప్సర బంగారు మైసమ్మ ఆలయానికి వస్తుండగా పూజారి సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఇది క్రమంగా వారి మధ్యవివాహేతర సంబంధానికి దారి తీసిందన్నారు. ‘సీసీ కెమెరాలు దృశ్యాలు, మొబైల్ఫోన్లోని వివరాల ఆధారంగా హత్య కేసును చేధించిన్నట్లు డీసీపీ తెలిపారు. అప్సరను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే నిందితుడు సాయికృష్ణ అంతమొందించినట్లు ప్రాథమికంగా తేలింది. సాంకేతిక వివరాలను పరిశీలించగా.. అతడొక్కడే హత్యకు పాల్పడినట్లు తేలింది. పక్కా ప్లాన్ ప్రకారమే అప్సరను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. అప్సర గతంలో గర్భం దాల్చింది. ఆమెకు అబార్షన్ కూడా అయిందని దర్యాప్తులో తేలింది. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నాం. నిందితుడుని పోలీస్ కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారణ చేస్తున్నాం. అప్సర కోయంబత్తూరు వెళ్తున్నట్టు తన ఇంట్లో చెప్పింది. ఆ తర్వాత సాయికృష్ణ ఆమెను శంషాబాద్ లోని పలు ప్రాంతాల్లో తిప్పి సుల్తాన్పుర్ తీసుకువచ్చి అంతమొందించినట్లు దర్యాప్తులో తేలింది’’ అని డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు.