హైదరాబాద్ : ఇటాలియన్ ప్రేరేపిత మాడ్యులర్ కిచెన్లు, వార్డ్రోబ్లకు చెందిన లెక్కో కుచీనా హైదరాబాద్లోని నాగోల్లో కొత్త షోరూంను తెరిచింది. దాదాపు 2000 చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా, అత్యంత సున్నితమైన డిజైన్లను అందరికీ అందుబాటులో ఉంచాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నామని లెక్కో కుచీనా బిజినెస్ హెడ్ త్రిశూల్ డెవంగ, స్టోర్ పార్ట్నర్ రామ్ మోహన్ రావు పేర్కొన్నారు. తమ ఉత్పత్తులకు జర్మన్ ఇంజనీరింగ్ నాణ్యత హామీ ఇస్తున్నామన్నారు 2025 నాటికి దేశ వ్యాప్తంగా విస్తరించాలని నిర్దేశించుకున్నామన్నారు.