![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/IMG-20231104-WA0030.jpg)
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ యువజన సంఘం సభ్యులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిని నాయకత్వాన్ని బలపరుస్తూ శ్రీకృష్ణ యాదవ యువజన సంఘం సభ్యులు పీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ప్రజా నిలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీకృష్ణ యాదవ యువజన సంఘం సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ రెడ్డి విజయం కోసం కృషి తమ వంతు ఇది చేస్తామని పార్టీలో చేరిన యాదవ్ యువజన సంఘ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో శ్రీకృష్ణ యాదవ్ యువజన సంఘం అధ్యక్షులు బాస నరేష్ యాదవ్, కార్యవర్గ సభ్యులు మనోహర్ యాదవ్, అరవింద్ యాదవ్, ప్రశాంత్ యాదవ్, గుంటి అశోక్ యాదవ్, బాస దిలిపి యాదవ్, మధు యాదవ్, సతీష్ యాదవ్, మల్లేష్ యాదవ్, తరుణ్ యాదవ్, దేవేందర్ యాదవ్, వినోద్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్, మైనార్టీ నాయకుడు యం.డి మూకీం తదితరులు పాల్గొన్నారు.