బీఎల్ఎఫ్, ఎంసిపిఐయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాల అశోక్,చైర్మన్ నల్లా సూర్యప్రకాష్
నవ తెలంగాణ -కంటేశ్వర్
బహుజన రాజ్యాధికారమే బీఎల్ఎఫ్ లక్ష్యం అని బిఎల్ఎఫ్ ఎం సీపీఐయు అఖిలభారత ప్రధాన కార్యదర్శి అశోక్ చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి సబ్బని నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐఎంయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాల అశోక్ బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ లు బహుజన లెఫ్ట్ పార్టీ-బీఎల్ఎఫ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడిన బిఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి సబ్బని లత ఇంటి నుండి ర్యాలీ ప్రారంభమై అంబేడ్కర్ కాలనీలోగల ఫూలే అంబేడ్కర్ ల విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సబ్బని లత కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు బహుజన లెఫ్ట్ పార్టీ-బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె.మధు, టీ.రాజకుమార్ , మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి టీ.రాజు,కె.సాయి, జీ.గంగాధర్ లతో పాటు రెండు వందల మంది ఇతరులు పాల్గొన్నారు.