నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్ట్ మెంట్ల వెల్లువతో పాటు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు ఉండటం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 803 పాయింట్లు లాభపడి 64,718కి చేరుకుంది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 19,189కి ఎగబాకింది. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 64,768 పాయింట్ల గరిష్టాన్ని తాకింది.