– రిజ్వీకీ, టీఎస్ఎంసీ రిటర్నింగ్ అధికారికీ హెచ్ఆర్డీఏ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికల్లో నిలోఫర్ ఆస్పత్రి పీడియాట్రిక్స్ విభాగం మాజీ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ అక్రమాలకు పాల్పడుతున్నారని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఆరోపించింది. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హెచ్ఆర్డీఏ తరఫున అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీతో పాటు టీఎస్ఎంసీ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి గురువారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పూర్తి చేయని బ్యాలెట్ పేపర్లు (బ్లాంక్ పోస్టల్ బ్యాలెట్)లను సేకరించాలని పోస్ట్ గ్రాడ్యుయేట్లపై ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్టర్ రవికుమార్ వాట్సప్ మెసేజ్లతో కూడిన స్క్రీన్ షాట్ను ఫిర్యాదుతో జత చేసినట్టు మహేశ్ కుమార్ తెలిపారు.