– ఈ మేరకు సీబీఐకి సిఫారసు చేయాలి
– కేంద్ర హౌం మంత్రికి మణిపూర్లోని ఐటీఎల్ఎఫ్ విజ్ఞప్తి
ఇంఫాల్: మణిపూర్లో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న జాతి కలహాల విషయంలో నిష్పక్షపాతంగా, సమానంగా వ్యవహరించాలని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్లను ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) కోరింది. ఈ మేరకు ఏజెన్సీకి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేసింది. చురచంద్పూర్ జిల్లాలోని గుర్తింపు పొందిన కుకి-జో తెగల సమ్మేళనం అయిన ఐటీఎల్ఎఫ్ ”దౌర్జన్యాలకు నిరసనగా కుకీ-జో-మెజారిటీ చురచంద్పూర్ పట్టణంలో భారీ ర్యాలీ తర్వాత డిప్యూటీ కమిషనర్ ద్వారా అమిత్ షా, సూద్లకు సమర్పించిన 10 పేజీల మెమోరాండంలో తన అభ్యర్థనను చేసింది. నిరసనకారులు మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్యాప్తు సంస్థలు మెయిటీ కమ్యూనిటీ ద్వారా గిరిజనులపై అఘాయిత్యాల కేసులను దర్యాప్తు చేయాలని డిమాండ్ వినిపించారు. మే 3న ప్రారంభమైన జాతిహింస ఘర్షణలో కనీసం 181 మంది మరణించిన విషయం విదితమే. ఈ అల్లర్లను నియంత్రించే విషయంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.