నవతెలంగాణ-ములకలపల్లి
కార్మిక వర్గ ఉద్యమ పోరాటాలు ఉదృతంగా నిర్వహించిన ఉద్యమ నేత సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ పిట్టల అర్జునురావుని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి అప్పారావు కోరారు. గురువారం మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మిక వర్గ మ్యానిఫెస్టోను విస్మరించిన పార్టీలను ఓడించాలని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దుబ్బా ధనలక్ష్మి, మండల కన్వీనర్ నిమ్మల మధు, మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ మండల కార్యదర్శి బుగ్గ వెంకట నరసమ్మ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి ఓరుగంటి శ్రీను, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి వర్క రుక్మాధవ్ రావు తదితరులు పాల్గొన్నారు.