– ఎన్నికల కమిషన్కు నిరంజన్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొత్తగా నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూకు అనుమతి ఎలా ఇచ్చారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అక్కడ కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం కనపడేలా షూటింగ్ చేశారని ఆరోపించారు. ఆ ఇంటర్వ్యూపై విచారణ జరిపిం చాలని డిమాండ్ చేశారు. కవులు, కళాకారులకు గోరటి వెంకన్న ఒక మచ్చలా మారారని విమర్శించారు. కాంగ్రెస్కు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు.