నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా చేపట్టిన తనిఖీల్లో అధికారులు గురువారం రూ.7,95,01,242 విలువ చేసే నగదు, బంగారు, వెండి, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందులో రూ. 2,86,29,543 నగదు, రూ.2,94,16,524 విలువ చేసే మద్యం పట్టుబడింది.రూ. 59,19,500 విలువ చేసే మత్తు పదార్థాలు, రూ.1,11,24,000 విలువ చేసే బంగారం, వెండి, రూ.44,11,675 విలువ చేసే ఇతర వస్తువులను అధికారులు పట్టుకున్నారు..అక్టోబర్ 9నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ. 577,32,24,246 విలువ చేసే నగదు, బంగారు, వెండి, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర వస్తువులను పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.