– రేపు న్యూజిలాండ్తో సెమీస్ సవాల్
ముంబయి : ఐసీసీ 2023 ప్రపంచకప్ సెమీఫైనల్ కోసం టీమ్ ఇండియా క్రికెటర్లు ముంబయికి చేరుకున్నారు. ప్రపంచకప్ గ్రూప్ దశ చివరి మ్యాచ్లో నెదర్లాండ్స్ను చిత్తు చేసిన రోహిత్సేన సోమవారం బెంగళూర్ నుంచి ముంబయికి చేరుకుంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరోసారి జట్టు కంటే ముందుగానే ఒంటరిగా ముంబయికి చేరుకోగా.. జట్టుతో పాటు రోహిత్ శర్మ ఎయిర్పోర్ట్లో దిగాడు. గ్రూప్ దశలో 9 మ్యాచుల్లో విజయాలు సాధించి అజేయంగా నిలిచిన భారత్.. బుధవారం వాంఖడెలో సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. కివీస్ క్రికెటర్లు సోమవారం ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చగా.. టీమ్ ఇండియా క్రికెటర్లు నేడు నెట్స్లోకి దిగనున్నారు.