నవ తెలంగాణ- ఆర్మూర్ : రెండో సారి అధికారంలోకి వచ్చి డ్రైవర్ రంగానికి చేసింది ఏమి లేదని ఏ ఐ టి యు సి జిల్లా నాయకులు అరేపల్లి సాయిలు అన్నారు. మంగళవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ .. 104 సంవత్సరాల ఆవిర్భావం సందర్భంగా నాయకులు జిల్లా జెండా ఆవిష్కరణ చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు స్వతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించి కార్మికుల హక్కుల కోసం కొట్లాడి 44 కార్మిక చట్టాలను సాధించిన AITUC.. ఆవిర్భవించి 104 సంవత్సరాల నుండి నిత్యం కార్మికులను ఐక్యం చేస్తూనే మరో పక్క కార్మిక కర్షకులను చైతన్య పరుస్తూ కార్మిక హక్కుల రక్షణ కోసం నిత్యం పనిచేస్తుంటే.. ఢిల్లీ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్స్ కు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చి అధుకుంటే.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల హక్కులను కేసిఆర్ కాలరస్తున్నరని తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారిద్ర్య రేఖకు దిగువనున్న ఆటో డ్రైవర్స్ ని ఆదుకోవడంలో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపిందని.. ప్రమాదంలో మరణించిన లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ప్రమాద ఇస్తానని ప్రకటించి తొమ్మిది సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు ఏ ఒక్క డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోలేదని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో.. మౌలానా, రాజేశ్వర్, కిష్టయ్య, పెరిజ్, రహిం, బాలయ్య, సుధాకర్.. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.