నవతెలంగాణ-భిక్కనూర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ను కామారెడ్డి నియోజకవర్గంలో నుండి పోటీ చేయమని తానే చెప్పినట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామం బీబీపేట్ మండలంలోని కోనాపూర్ గ్రామమని అక్కడ మానేరు నిండి పొలాలు మునిగిపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చింతమడకకు వలస వెళ్లిందని ఆయన పుట్టిన నియోజకవర్గం కాబట్టి బాధ్యతగా తన సొంత నియోజకవర్గంలో నుండి పోటీ చేయమని తానే స్వయంగా మూడుసార్లు విన్నపించానని ముఖ్యమంత్రి కెసిఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తే తన భవిష్యత్తును ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేయకపోతే తానే పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు తాను గెలువనని ముఖ్యమంత్రిని కామారెడ్డికి తీసుకు వస్తున్నారని అసత్యపు ప్రచారం చేస్తున్నారని గత రెండు పర్యాయాలు తాను ఓడిపోతున్నానని ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా చెప్పారని ప్రజల ఆశీస్సులతో ప్రతిసారి తానే గెలిచానని ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేయకుంటే మరోసారి తానే పోటీ చేసి విజయం సాధిస్తానని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.