నవతెలంగాణ- మద్నూర్
వానాకాలం పంట సాగులో భాగంగా పెసర పంట కోతకు వచ్చింది పెసర పంటకు గత కొన్ని సంవత్సరాలు కాలంగా అధిక వర్షాలు దెబ్బతీస్తున్నాయి. ఏడాది కూడా అధిక వర్షాలు కు కురియడంతో పెసర పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయ రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది ఎకరాకు మూడు నుండి నాలుగు క్వింటాళ్ల పంట దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది రెండు క్వింటాళ్లలోపే దిగుబడి వస్తున్నట్లు వ్యవసాయ రైతులు చర్చించుకుంటున్నారు. పెసర పంట కోతకు రాగానే పెసర సుగ్గి అంటారు ఈ పంట కోసం కూలీలు తెల్లవారుజామునే చేనుల్లోకి బయలుదేరుతారు. శనివారం నాడు పెసర పంట కోతకు కూలీలు తెల్లవారుజామున నుండే బయలుదేరడం కనిపించింది పంట దిగుబడి తక్కువ కూలీలకు సరైన కూలీ పడటం లేదని రైతులు పంట కోతకు ఐదు ఆరు పాళ్లు పెట్టి కూలీలకు ఒక పాళ్లు ఇస్తున్నట్లు దినమంత పని చేస్తే ఒక మానెడు కూడా రావడం లేదని కూలీల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. పెసర పంట కోతకు రాగానే కూలీలు ఉదయం నుండే చేనుల్లోకి బారులు తీరుతారు ఎందుకంటే పంట కోతలు చాలా కష్టాలు ఉంటాయి ముందుగా కోత పెట్టుకొని మధ్యాహ్నం తర్వాత దానిని కట్టెలతో రాసులు చేస్తారు రైతన్నకు దిగుబడి తక్కువ కూలీలకు మానేడు పంట కూడా రోజు వారి కూలీలు పడడం లేక అటు రైతన్న ఇటు కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా పెసర పంట కోత సుగ్గి ప్రారంభమైందంటే పంట కోతల కోసం కూలీలంతా తెల్లవారుజామున నుండే చేనుల్లోకి బయలుదేరుతారు.