నవతెలంగాణ-హైదరాబాద్ : పసికూన జట్టుగా ముద్రపడిన నెదర్లాండ్స్ వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. గురువారం స్కాట్లాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో 6 వికెట్లతో విజయం సాధించడంతో మెగా టోర్నీలో ఆడే అవకాశాన్ని నెదర్లాండ్స్ తొలిసారి దక్కించుకుంది. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రెండన్ మెక్ములెన్ సెంచరీతో రాణించాడు. 110 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 రన్స్ చేశాడు. కెప్టెన్ బెరింగ్టన్ 64 రన్స్తో రాణించాడు. స్కాట్లాండ్ నిర్దేశించిన 278 పరుగుల లక్ష్యాన్ని 42.5 ఓవర్లలోనే నెదర్లాండ్స్ చేధించింది. బాస్ డి లీడే సూపర్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ప్రపంచకప్ రేసు నుంచి నిష్క్రమించాయి. బుధవారంం జింబాబ్వేపై విజయంతో స్కాట్లాండ్ ప్రపంచకప్ ఆశలు పెట్టుకున్నా నెదర్లాండ్స్ గట్టి షాక్ ఇచ్చింది.