నవతెలంగాణ – హైదరాబాద్: డ్రగ్స్ పట్టివేతలో చేతివాటం ప్రదర్శించిన ఎస్ఐ రాజేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రాజేందర్ సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల మహారాష్ట్రలో చేసిన ఓ ఆపరేషన్లో ఎస్ఐ రాజేందర్ పాల్గొన్నారు. అందులో పట్టుబడిన డ్రగ్స్లో ఎస్ఐ రాజేందర్ కొంత దాచిపెట్టి అమ్ముకునేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఎస్ఐ రాజేందర్ ఇంట్లో తనిఖీలు చేపట్టి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు రాజేందర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.