నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని కార్కళ వద్ద తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శృంగేరి పీఠాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా మంగళూరు సమీపంలో ముడూరు – నల్లూరు క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే కారు ప్రమాదం నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన కార్కళ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరో వాహనంలో శృంగేరికి పంపించారు.