నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపిని మసీదు అని పిలవలేమని, అలా పిలిస్తే వివాదం అవుతుందని అన్నారు. ఈ కేసులో ముస్లిం పక్షం ముందుకు వచ్చి తమ ‘చారిత్రక తప్పిదానికి’ పరిష్కారం చూపాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థ పాడ్కాస్ట్లో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘‘జ్ఞానవాపిని మసీదు అని పిలవలేం. అలా పిలిస్తేనే వివాదం అవుతుంది. భగవంతుడి దర్శనభాగ్యం ఎవరికి లభించిందో.. ఆ వ్యక్తి చూడాలని నేను భావిస్తున్నా. మసీదులో త్రిశూలం ఎందుకు ఉంది? మేం దాన్ని అక్కడ ఉంచలేదు. అక్కడ జ్యోతిర్లింగం ఉంది. దేవుళ్ల ప్రతిమలు ఉన్నాయి” అని చెప్పారు. ‘‘మసీదులో గోడలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఏవో చెబుతున్నాయి. ‘చారిత్రక తప్పిదానికి’ పరిష్కారం చూపేందుకు ముస్లిం సమాజం ఓ ప్రతిపాదనతో రావాలి” అని చెప్పారు.