– మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్
నవతెలంగాణ- నెల్లికుదురు: నలుగురు మండల వైస్ ఎంపీపీ అయినా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ ఎంపీటీసీ జిల్లా వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ తెలిపారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ తో పాటు మరో 20 మందికి కండలు కప్పి స్వాగతించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరోగ్యారెంటీ కార్డులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరిగిందని అన్నారు. ఉచిత విద్యుత్తు రుణమాఫీ తదితరవి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలం చెందారని అన్నారు. తెలంగాణ ఏర్పడుతూ నిధులు నియమకాలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మోసం చేశారు తప్ప అమలు చేసిన దాఖలు లేవని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసిహెచ్ వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు నాయని సత్యపాల్ రెడ్డి గుగులోతు బాలాజీ నాయక్ కాసం లక్ష్మారెడ్డి తిరుమల మల్లేశం పిట్టల మురళి చిన్న బోయిన శ్రీనివాస్ వర్రె అశోక్ జిల్లా సోమయ్య జెల్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.