నవతెలంగాణ -సుల్తాన్ బజార్: శ్రీ త్యాగరాజు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో కళార్చన కార్యక్రమం గురువారం కళాశాల ప్రాంగణం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పాండురంగ మొతాలిక్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బి. పవన్ కుమార్ గారి శిష్య బృందం కర్ణాటక వయోలిన్, టీ. వీ. రవికాంత్ గారి శిష్య బృందం తబల, కే సంతోష్ గారి శిష్య బృందం పేరిణి నృత్య ప్రదర్శన చేయగా ప్రేక్షకదరణ పొందింది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.