![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/Screenshot_20231116-110936_WhatsApp-300x163.jpg)
నవతెలంగాణ-మల్హర్ రావు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ను విజయం వరించాలని మదుకర్ సతీమణి, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజా గురువారం గుండారం సమ్మక్క,సారాలమ్మ వన దేవతలకు మొక్కులు చెల్లించి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎంగా కేసీఆర్ కావాలని ఆకాంక్షించారు. మధన్న గెలుపుకోసం గ్రామస్తుల కోరిక మేరకు ఆమె ఎత్తు బంగారంతో పాటు అమ్మవారికి చీరలు, ఓడి బియ్యం సమర్పించారు. సమ్మక్క సారలమ్మ దీవెనలు అందరిపై ఉండాలని,ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పుట్ట మదూకర్ గారు ఎమ్మెల్యేగా గెలిచి మంథనికి వెలుగులు ప్రసాదించాలని అమ్మవార్లను కోరుకున్నట్లు ఆమె తెలిపారు.ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రంలో కేసీఆర్, మంథనిలో పుట్ట మధూకర్ పాలన రావాలని ఆమె ఈ సందర్బంగా వేడుకున్నట్లు తెలిపారు.