– సమ్మె పరిష్కారంపై దృష్టి పెట్టండి
– అణచివేయాలని చూస్తే, రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమం ఉదృతం చేస్తాం
– ఎ.జె.రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
గత 37 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివోఏలు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం అణచివేత చర్యలను మానుకొని చర్చలకు పిలిచి సమ్మె పరిష్కారం చేయకపోతే రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంను ఉధృతం చేస్తామని సీఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ అన్నారు. భద్రాచలం పట్టణంలో సిఐటియు పట్టణ కమిటీ ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కో కన్వీనర్ మర్ల పాటి రేణుక అధ్యక్షతన జరిగిన సభలో ఎ.జె.రమేష్ మాట్లాడుతూ సమ్మె పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని, సమ్మె డిమాండ్లను పరిష్కరించ కపోగా,అధికారులతో వేధింపులకు పాల్పడు తుందని, తొలగిస్తామని, కొత్త వాళ్ళని నియమిస్తామని రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం పాల్పడటం సిగ్గు చేటని అన్నారు. గ్రామ స్థాయిలో వివోఏలు చేసే పని పట్ల, ఆ పని ద్వారా జరిగే లబ్ది ప్రభుత్వానికి తెలిసినా తనకేమీ పట్టనట్లు ప్రభుత్వం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమం లో పట్టణ కన్వీనర్ యం.బి.నర్సారెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు నకిరుకంటి నాగరాజు, లక్ష్మీకాంత్, అప్పారీ రాము, వేల్పూరి రాము బాలకృష్ణ, బాలాజీ, వాసు, నాయకులు అజరు, మురళి వివోఏ జిల్లా కోశాధికారి చంద్ర పట్టణ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, పట్టణ వివోఏ కోశాధికారి సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : ఈ నెల 22న వివోఏలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె లో భాగంగా అన్ని కలెక్టరేట్ల ముందు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో సిఐటియు నాయకులు, వివోఏ లను అక్రమంగా అరెస్టు చేసి లాఠీచార్జి చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి డి.వీరన్న తెలిపారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో వివోఏలు, అన్ని రంగాల కార్మికులతో మానవహారంచేట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, సిఐటియు లక్ష్మీదేవిపల్లి మండల నాయకులు యు.నాగేశ్వరరావు, ఐద్వా పట్టణ నాయకురాలు సందకూరి లక్ష్మి, విఓఏల నాయకురాళ్లు రేష్మ, మైమునిసా, మాధవి, స్వరూప, అరుణ, కృష్ణకుమారి, రాజమణి పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : వివోఎల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడాలని సిఐటియు జిల్లా కోశాధికారి జి పద్మ అన్నారు. నిరవధిక సమ్మెలో భాగంగా వివోఏలు మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం మండల నాయకులు నాగరాజు, శ్యాం రమేష్ రమాదేవి కమల పాపమ్మ పాల్గొన్నారు.