నవతెలంగాణ – అమరావతి: పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై వాలంటీర్ లైంగికదాడి చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని దెందులూరు మండలం పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాలంటీర్ నీలాపు శివకుమార్ ఆధార్ కార్డ్ కావాలంటూ వెళ్లాడు. బాలిక ఒంటరిగా ఉండటం చూసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తరచూ ఇంటికి రావడంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దాంతో అసలు విషయం బయటపడింది.