నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 19న ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో నీటి సరఫరా నిలిచిపోనుంది. మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్-2లో కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు పైప్లైన్కు జంక్షన్ పనులు జరగనున్నాయి. ఆర్అండ్బీ శాఖ బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్ పనులు చేపట్టనున్నారు.
నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే..
ఓఅండ్ఎం డివిజన్ నెం.6 : ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్ (తదితర ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం) ఓఅండ్ఎం డివిజన్ నెం.8 : ఈ డివిజన్ పరిధిలోని ఆఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు ఓఅండ్ఎం డివిజన్ నెం.9 : కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్టలో తాగు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఓఅండ్ఎం డివిజన్ నెం.15 : ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్. ఓఅండ్ఎం డివిజన్ నెం.24 : బీరంగూడ, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో వినియోగదారులు మంజీరా తాగు నీరు పొదుపుగా వాడుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది