నవతెలంగాణ – రేవల్లి
నాగపూర్ గ్రామం చెందిన కుమ్మరి లక్ష్మీనారాయణ(65) ఇతనికి ఒక కొడుకు, ఒక కూతురు. గన్యాల గ్రామానికి తన కూతుర్ని ఇవ్వడంతో చూడడానికి వెళ్ళిన లక్ష్మీనారాయణ తిరిగి తమ సొంత ఊరు నాగపూర్ కి బయలుదేరుతుండగా, కొత్తగా రోడ్డు వేస్తున్న గౌరీదేవి పల్లి నుంచి గన్యాకులకు వెళ్లే దారికి కంకర రోడ్డు వేస్తున్న సమయంలో, 20 టన్నుల కంకర లోడు టిప్పర్ ఎదురుగా గన్యాగుల ఊరు నుంచి వస్తున్న లక్ష్మీనారాయణ ఎక్సెల్ బండిని భారీ లోడుతో ఉన్న టిప్పర్ ఢీకొన్నడంతో స్పాట్ లో అక్కడికక్కడే మరణించాడు. లక్ష్మీ నారాయణ ఎక్సెల్ బండి నుజ్జు నుజ్జు కావడం చూసి డ్రైవర్ పరారు అయ్యాడు. అక్కడ ఉన్న గౌరీదేవి గ్రామస్తులు గమనించి, నాగపూర్ సర్పంచ్ కి తెలియజేసారు. సర్పంచ్ రేవల్లి మండల ఎస్సై శివకుమార్ కి చెప్పగా స్పాట్ కి వెళ్ళిన ఎస్ఐ అక్కడ జరిగిన సంఘటనను గమనించి ఎస్సై శివకుమార్ డెడ్ బాడీని వనపర్తి మార్చరికి పంపించి, కేసు నమోదు చేసి రిపోర్ట్స్ రాగానే దర్యాప్తు చేస్తామన్నారు, వనపర్తి మార్చర్ నుంచి పోస్టుమార్టం రిపోర్ట్స్ రాగానే తెలియపరుస్తామన్నారు.