నవ తెలంగాణ – దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ తాండ-1 ప్రాంతానికి చెందిన “మాలోతు రాజు” ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంభానికి ఆదివారం 5లక్షల ప్రమాద బీమా చెక్కును కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, మల్కాజిగిరి పార్లమెంట్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి లు అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ తాండ-1 “మాలోతు రాజు” ప్రైవేట్ కార్ డ్రైవర్ గా పనిచేస్తూ విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బిఆర్ టియు అనుబంధ టాక్సీసెక్టార్, డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో వారి కుటుంభానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, మల్కాజిగిరి పార్లమెంట్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి లతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో టాక్సీ సెక్టార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అత్తిన మొని నాగేష్ కుమార్, టాక్సీ సెక్టార్ యూనియన్ నాయకులు
కంటోన్మెంట్ మాజీ బోర్డ్ సభ్యులు పాండు యాదవ్, జాయింట్ సెక్రెటరీ జిల్లెల్ల మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగాజుల పాటి నరేష్ , సీసీ డిఏ కిరణ్, ప్రమోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.