నవతెలంగాణ నారాయణఖేడ్ రూరల్
వాస్తవ వార్తలు రాయా లని జాతీయ జర్నలిస్టు దినోత్స వ సందర్భంగా ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. జాతీయ జనరలిస్ట్ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని పత్రిక, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారిని శాలువాతో సన్మానించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. మండల జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి రవీందర్ నాయక్,మున్సిపల్ ఛైర్మెన్ రుబీనా నజీబ్,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి,మాజీ మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్,మాజీ ఎంపీటీసీ ముజామిల్ పాల్గొన్నారు.