తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

tirumala tempelనవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 32,078 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.