– కాంగ్రెస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్
– శామీర్ పేట మండలంలో రోడ్ షో
నవతెలంగాణ-శామీర్ పేట
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోం దని, కాంగ్రెస్ హయాంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని కాంగ్రెస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. శామీర్పేట్ మండలంలోని పొన్నాల, బొమ్మరాసిపేట , బాబాగూడ, అలియాబాద్, లాల్గడి మలక్పేట్ , మురహరిపల్లి, , తుర్కపల్లి, యాడారం , మజీద్పూర్ శామీర్పేట గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో గడప గడపకి కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి , రాష్ట్ర సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ తో కలిసి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రచారం చేశారు. కాగా భారీ ఎత్తున మహిళలు యువకులు తరలివచ్చి జై కాంగ్రెస్ జై వజ్రేష్ యాదవ్ అంటూ నినాదాలు చేయడంతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకుసాగారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లా డుతూ… అసమర్థ నాయకులు మల్లారెడ్డి మేడ్చల్కు చేసింది ఏమి లేదని మేడ్చల్ లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. తాను వార్డు సభ్యుని స్థాయి నుండి ప్రజా సేవలో ఉన్నానని స్థానిక సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉందని మేడ్చల్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయానని మూడోసారి ఎమ్మెల్యే గా బరిలో ఉన్నానని తనను ఆశీర్వదించి చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఏ బ్లాక్111 అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, శామీర్ పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాష్కీ శంకర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంఠం కష్ణారెడ్డి, శామీర్ పేట ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సరసం అశోక్ రెడ్డి, మేకల మహేందర్ యాదవ్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముజీబ్, బొమ్మరాసిపేట ఎంపీటీసీ ఇందిరా, రాంరెడ్డి, సుధాకర్ రెడ్డి, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు , కార్యకర్తలు పాల్గొనారు.
మేడ్చల్ గడ్డమీద ఎగిరేది కాంగ్రెస్ జెండా : వజ్రేష్ యాదవ్
మేడ్చల్ గడ్డమీద ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని మేడ్చల్ కాంగ్రెస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. శామీర్ పేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విలసాగరం అశోక్, బీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు బలరాం, మాజీ వార్దు సభ్యులు డి. ఎల్లం, రాపని శ్రీనివాస్, ఎస్టీ సెల్ నాయకులు హీరా లాల్, కార్యకర్తలు రాజు నర్సింగ్ రావు లు మంగళవారం మేడ్చల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కో ఆప్షన్ ముజీబ్, సీనియర్ నాయకుడు మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.