– జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్
నవతెలంగాణ-భూపాలపల్లి
అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు అందరికీ తప్పనిసరిగా ఓటర్ స్లిప్పు లు పంపిణీ చేసేవిధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి వెబ్ క్యాస్టింగ్ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సంద ర్భంగా సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ… క్రిటికల్ పోలింగ్ కేం ద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, దీనికి అవసరమైన మేర యంత్రాంగం సిద్దం చేసుకోవాలని అన్నారు. స్థానిక యువతను వెబ్ క్యాస్టింగ్ కోసం వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఓటరు స్లిప్పుల అందలేదని గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని, వాటి నివారణకు ముందస్తుగా ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణ కోసం నోడల్ అధికారి నియమించాలని, ఫిర్యాదులు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయాలని అన్నారు. వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఏలను సైతం భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పై ప్రతి రోజూ నివేదికలు సమర్పించాలని అన్నారు. ప్రతి ఒక్క ఓటరుకు తప్పనిసరిగా ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థులకు, వారి అనుచ రులకు సి విజల్ యాప్ పై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సంభందిత అధికారులు పాల్గొన్నారు.