– కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజు రెడ్డి
నవతెలంగాణ- కౌడిపల్లి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగెగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజారెడ్డి, రాష్ట్ర నాయకురాలు చిలుముల సుహాసిని రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో నర్సాపూర్ నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవుల రాజిరెడ్డి హాజరయ్యారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 15 రోజులు కార్యకర్తలు, నాయకులు మమేకమై సంయుక్త నిర్ణయాలతో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల అమలును ప్రజలకు క్లుప్తంగా వివరించాలని సూచించారు. టిపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, చిలప్ చెడు మాజీ జెడ్పిటిసి చిలుముల శేష సాయి రెడ్డి, జిల్లా నాయకులు సుధీర్ రెడ్డి, చంద్రం కష్ణ గౌడ్, సంగయ్య పేట సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వినోద, నర్సాపూర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుజాత, నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హంసి బారు, శివంపేట్ మాజీ జెడ్పిటిసి కమలా పూల్ సింగ్, నర్సాపూర్ మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా, ఆయా మండలాల అధ్యక్షులు మల్లేశం గౌడ్, సుదర్శన్ గౌడ్, నరేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రఘు ,యూత్ అధ్యక్షుడు దన్ సింగ్, సిపిఐ నాయకులు కాలిక్, నాయకులు, చర్ల మణిదీప్, ప్రవీణ్ రెడ్డి, ఆయా మండలాల ముఖ్య కార్యకర్తలు గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.