నవతెలంగాణ-అక్కన్నపేట
ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని, ఓటు ఒక వజ్రాయుధమని సీఐ కిరణ్, ఎస్ఐ వివేక్ అన్నారు. గురువారం అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి, కేశవాపూర్, మోత్కులపల్లి, పెద్ద తాండ, కట్కూర్, చాప గాని తాండ, గ్రామాలలో కేంద్ర బలగాలు ఎస్ఎస్బీ అధికారులు, సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కిరణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని, ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమకుు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100, డయల్ 100 కాల్ చేయాలన్నారు. మద్యానికి, డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేశామని, పోలింగ్ జరిగే రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చుతామన్నారు.