– కాంగ్రెస్కు రాజీనామా చేసిన మ్యాడం బాలకష్ణ
నవతెలంగాణ-మెదక్
కాంగ్రెస్ పార్టీని తెలంగాణాలో నిర్మూలించేందుకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మ్యాడం బాలకష్ణ వ్యాఖ్యానించారు. గురువారం మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, నాయకులను సమన్వయపర్చడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంద న్నారు. పదేళ్ల నుంచి కష్టపడిన నాయకులను కాదని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కెట్ను ప్యారాషుట్ వాళ్లకు కేటాయించారన్నారు. ఉదరు పూర్ డిక్లరేషన్ కు విరుద్ధంగా ఓకే కుటుంబానికి చెందిన మైనంపల్లికి రెండు టిక్కెట్లు ఇవ్వడం అవమానకరంగా భావిస్తున్నట్లు తెలిపారు. మైనంపల్లికి రేవంత్ సున్నం పెడతాడని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీ వైశ్యులకు ఒక్క టిక్కెట్ కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలు ఎట్లా విశ్వసిస్తారన్నారు. కాంగ్రెస్ లో సరైన గుర్తింపు లేక అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.