– దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సతీమణి మంజులత
నవతెలంగాణ- చేగుంట
60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగు నీళ్లకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లను ఇస్తున్నారని, దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సతీమణి కొత్త మంజులత పేర్కొన్నారు. మండల పరిధిలోని చిటోజిపల్లి, రెడ్డిపల్లి, పోలంపల్లి, చేగుంట, బి కొండాపూర్ గ్రామాలలో గురువారం జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా శర్మతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో మహిళలు బతుకమ్మ, బోనాలు, డప్పుచప్పులతో గ్రామాలకు ఆహ్వానం పలికారు. దుబ్బాక అభ్యర్థిగా ఉన్న తన భర్త అయిన ప్రభాకర్ రెడ్డిని ప్రచారం చేస్తున్న క్రమంలో కత్తిపోటుతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ప్రజలందరూ ప్రభాకర్ రెడ్డి చేసిన సేవలను గుర్తించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్, నియోజకవర్గ నాయకుడు సోలిపేట సతీష్ రెడ్డి, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, చేగుంట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండిలెడ్డి, వైస్ చైర్మన్ పట్నం తనీషా, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మేకల పరమేష్, ఇబ్రహీంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, మండల ఇన్చార్జి వెంకట నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు నిర్మల సత్యం, దోశల బాల్నర్స్, జిల్ల్షా సీనియర్ రంగయ్య గారి రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, పోతనపల్లి సిద్ది రెడ్డి, టెలికాంబోర్డు మాజీ సభ్యుడు వేణుగోపాల్ శర్మ, టెలికాం బోర్డు సభ్యుడు సోమ సత్యనారాయణ, యువకులు, పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.